విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి : సినీనటుడు సుమన్‌

ప్రజాశక్తి – వీరఘట్టం (పార్వతీపురం మన్యం జిల్లా) : విద్యాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని సినీ నటుడు సుమన్‌ అన్నారు. వీరఘట్టం మండలంలోని కత్తులకవిటి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ మనబడి, నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి చేయడంతో పాటు అమ్మ ఒడి, విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక వంటి పథకాలు అందజేసి బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్య అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి ఉన్నత శిఖరాలు అవలంభించాలని విద్యార్థులకు సూచించారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న పదో తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు చక్కగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని సూచించారు. అలాగే గ్రామంలో సత్యసాయిబాబా మందిరాన్ని సందర్శించారు.

➡️