పలువురికీ గొట్టిపాటి పరామర్శ

Jan 21,2024 00:34

ప్రజాశక్తి – అద్దంకి
టిడిపి పాలనతోనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పట్టణంలోని 1వ వార్డులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టిడిపి అధికారంలోకి వస్తే అమలుచేసే పధకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశక్తి, అన్నదాత, యువగళం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి రక్షిత మంచి నీటి పథకంతో పాటు పూర్‌ టు రిచ్ పదకాలు అమలుచేస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, టిడిపి కౌన్సిలర్లు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు.

➡️