శంషాబాద్ : ఓ వ్యక్తి దుబారు నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దుబారు నుంచి హైదరాబాద్కు విమానంలో వచ్చిన ప్రయాణికులను శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి లగేజీ బ్యాగుతో పాటు ప్రయాణికుడిని స్కానింగ్ చేయడంతో వ్యక్తి వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు బంగారాన్ని వైర్ రూపంలో తయారు చేసి మెటాలిక్ షోకేస్లో అమర్చుకొని అక్రమంగా దాచిపెట్టి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకొని రూ.27.92 లక్షల విలువ చేసే 449 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకొని.. అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.