శ్రీ చైతన్య విద్యార్థులకు బంగారు పతకాలు

Apr 15,2024 22:23

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : ఇంటర్నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలంపియాడ్‌ సెకండ్‌ లెవెల్‌లో శ్రీ చైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారు. ఐఎన్‌టిఎస్‌ఒ సెకండ్‌ లెవెల్‌లో మొత్తం 185 మంది విద్యార్థులు పాల్గొనగా వీరిలో ఒకరికి ట్యాబు, ముగ్గురికి స్మార్ట్‌ వాచ్‌లు, నలుగురికి స్పెషల్‌ ఫ్రైజ్ల, 14 మందికి గోల్డ్‌ మెడల్స్‌ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ కె.సునీత ఇంతటి ఘన విజయాన్ని సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందన కార్యక్రమం సోమవారం పాఠశాలలో జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ సునీత మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారణమైన శ్రీ చైతన్య కరిక్యులం మేనేజ్మెంట్‌, ప్రణాళిక, ఉపాధ్యాయుల కేరింగ్‌ ,విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ జిఎం మురళీకష్ణ, ఆర్‌ వి రాజేష్‌, కో- ఆర్టినేటర్‌ సురేష్‌ బాబు, డీన్‌ నరేష్‌, ప్రిన్సిపాల్‌ కె.సునీత, ఇచ్చార్చి, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

➡️