ప్రభాస్ తమ్ముడు విరాజ్ రాజ్ హీరోగా ‘గౌడ్ సాబ్’ అనే చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాతో టాలీవుడ్ డ్యాన్స్ మాస్టర్ భీమ్లా నాయక్ ఫేమ్ గణేష్ మాస్టర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ పాద ఫిలిమ్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతోంది. బుధవారం ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సుకుమార్ క్లాప్ కొట్టి టైటిల్ను ఆవిష్కరించారు. ఈ సినిమాతో గీత రచయిత వెంగీ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్ బ్యానర్పై ఎస్ఆర్ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికష్ణ కార్తీక్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.