రైతులకు డ్రమ్ములు, పదలు అందజేత

Mar 2,2024 23:20

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని కోనేటిపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా 200, 100 లీటర్ల డ్రమ్ములు, రెండు పరదాలను ఉచితంగా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వాణిశ్రీ చేతుల మీదగా శనివారం 177 మంది రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహంగా వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన పానుగంటి సాంబశివరావుకు చెందిన ఆవులు చింతమోటు గ్రామానికి చెందిన ఐసిఆర్పి షాపుకు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఐసిఆర్పి ఝాన్సీ, శివనాగేశ్వరమ్మ, బి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️