పోటీకి గులాం నబీ అజాద్‌ దూరం

Apr 18,2024 00:34 #away, #competition, #gulab nabi

శ్రీనగర్‌ : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో డెమెక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ అజాద్‌ పార్టీ (డిపిఎపి) అధ్యక్షులు గులాం నబీ అజాద్‌ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని పార్టీ బుధవారం వెల్లడించింది. కొన్ని కారణాలతో అజాద్‌ పోటీ చేయడం లేదని తెలిపిన పార్టీ, ఆ కారణాలను మాత్రం వెల్లడించలేదు. ముందుగా అనంత్‌నాగ్‌-రాజౌరీ లోక్‌సభ స్థానం నుంచి అజాద్‌ పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్థానం నుంచి డిపిఎపి తరుపున న్యాయవాది సలీమ్‌ పర్రేను అభ్యర్థిగా నిర్ణయించినట్లు పార్టీ నాయకులు అమీన్‌ భట్‌ తెలిపారు. ఈ స్థానం నుంచి పిడిపి తరుపున మహబూబ ముఫ్తీ, ఎన్‌సి తరుపున మెయిన్‌ అల్తాఫ్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

➡️