గౌతం గంభీర్‌ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌ బై..

ఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి వైదొలగి క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా ఈ రోజు ప్రకటించాడు. రాజకీయ విధుల నుంచి తనను రిలీవ్‌ చేయాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరినట్టు ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించాడు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలపుకొంటున్నట్టు పేర్కొన్నాడు. కాగా మార్చి 2019లో బీజేపీలో చేరిన గంభీర్‌ ప్రస్తుతం ఈస్ట్‌ ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ ఎన్నికల్లో ఏకంగా 6.95 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించాడు. తాజాగా రాజకీయాలకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నాడు.

➡️