నేటి నుంచి ‘రా.. కదలిరా’ !

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నుంచి జిల్లాల పర్యటనలు చేయనున్నారు. ‘రా.. కదలిరా’ కార్యక్రమం పేరుతో ఈ పర్యటన నిర్వహించనున్నారు. 5న ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో తొలి సభ నిర్వహించనున్నారు. ఈ నెల 29 వరకు 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు జరపనున్నారు. రోజుకు 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సభల కోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌ను సిద్ధం చేసుకున్నారు. కొన్ని సభలకు చంద్రబాబుతోపాటు పవన్‌కళ్యాణ్‌ కూడా హాజరవుతారని అంటున్నారు. టిడిపిలోకి పాడేరు వైసిపి నేతలుపాడేరు నియోజకవర్గానికి చెందిన వైసిపి సర్పంచులు, ఎంపిటిసిలు, ఆ పార్టీ నేతలు టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో వారికి టిడిపి కండువా కప్పి గురువారం పార్టీలోకి ఆహ్వానించారు. పంచాయతీలకు మరలా మహర్దశ రావాలంటే టిడిపితోనే సాధ్యమని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. టిడిపిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. వినుకొండకు చెందిన పారిశ్రామిక వేత్త బోడేపూడి సుబ్బారావు వెబ్‌సైట్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు.

➡️