విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘గామి’. మార్చి 8న విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న విశ్వక్ సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘చాలా రిస్క్ చేసి ‘గామి’ సినిమా తీశాం. ఇది కమర్షియల్గా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మేం ఆరేళ్లు కష్టపడి తీసిన సినిమా ఇది. మా సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి.. మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా. ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదని గర్వంగా చెబుతాను. మరో 20 ఏళ్ల తర్వాత తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందని గర్వంగా చెప్పొచ్చు. అంటూ విశ్వక్ వెల్లడించారు.