- రాష్ట్రపతి ముర్ము సంతాపం
ఒడిశా : ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడటంతో ఏడుగురు చనిపోయారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు గల్లంతయ్యారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా చేపట్టిన గాలింపు చర్యల్లో నలుగురి మృతదేహాలు వెలికితీశారు.
ఆ తర్వాత గాలింపు చర్యలకు ఆటకం ఏర్పడటంతో శనివారం ఉదయం నుంచి ఒడిఆర్ఎఎఫ్ బందాలు గల్లంతైనవారికోసం గాలించాయి. మరో నలుగురి మృతదేహాలు వెలికితీసినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ గోయల్ చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.