BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్‌

Bతెలంగాణ : బిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహేల్‌ను పోలీసులు సోమవారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్ట్‌ చేశారు. దుబారు నుంచి హైదరాబాద్‌ చేరుకున్న రహేల్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన రహేల్‌ తర్వాత దుబారు కు పారిపోయాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రహేల్‌ పై హైదరాబాద్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు కూడా జారీ చేశారు. చివరకు ఈరోజు దుబారు నుంచి హైదరాబాద్‌ కు వస్తుండగా ఎయిర్‌ పోర్టులో పట్టుకున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత మరొకరిని ఈ కేసులో డ్రైవర్‌ గా మార్చిన రహేల్‌ కు పోలీసులు షాకిచ్చారు. సీసీ టీవీ ఫుటేజీ చూసి అతనిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

➡️