కేసీఆర్‌ను పరామర్శించిన మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు

Jan 7,2024 16:25 #ex governer, #paramarsa

హైదరాబాద్‌: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పరామర్శించారు. ఆదివారం నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన నరసింహన్‌ దంపతులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వాగతం పలికారు. కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం నరసింహన్‌ దంపతులు కాసేపు ఆయన కుటుంబసభ్యులతో ముచ్చటించారు.కాగా, కేసీఆర్‌ గత నెలలో బాత్రూమ్‌లో జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దాంతో యశోద ఆస్పత్రి వైద్యులు ఆయనకు సర్జరీ చేసి నాలుగు వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అప్పటి నుంచి ఆయన నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు. గురువారం ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా కేసీఆర్‌ను పరామర్శించి వెళ్లారు.

➡️