విజయవాడలో విద్యుత్ అదనపు డిపాజిట్లు పేరుతో బలవంతపు వసూళ్లు

Mar 27,2024 16:17 #Ch Baburao, #Vijayawada

ప్రజాశక్తి – విజయవాడ : విజయవాడలో విద్యుత్ అదనపు డిపాజిట్లు పేరుతో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయి. అధికారులు నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ సిబ్బంది ఫీజులు పీకేస్తున్నారు. ఈ చర్యను పాయకాపురం, శాంతినగర్ లో స్థానిక ప్రజలు ప్రతిఘటించారు. వీరి ఆందోళనలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, ఇతర నేతలు అండగా నిలిచారు.  ఈ సందర్భంగా  బలవంతపు వసూళ్లు ఆపాలని, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం నిలిపివేయాలని, నేతలు,  ప్రజలు డిమాండ్ చేశారు.

➡️