కాంగోను ముంచెత్తిన వరదలు : 22మంది మృతి

Dec 27,2023 08:44 #22, #Congo, #floods, #people died

కాంగో : కాంగోను భారీ వరదలు ముంచెత్తాయి. మంగళవారం కాసారు సెంట్రల్‌ ప్రావిన్స్‌లో వరదల ఉధృతికి 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాంగోలో భారీ వర్షాలు కురవడంతో నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. వరదల్లో పలువురు గల్లంతయ్యారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు, చర్చ్‌లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కనంగా ప్రాంతంలో గోడలు కూలి పలువురు మృతి చెందినట్లు కనంగా మేయర్‌ రోస్‌ మువాది ముసుబే వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా కనంగా ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టించడంతో మృతుల సంఖ్య అక్కడే ఎక్కువగా ఉంది. 25 రోజుల క్రితం బుకావు ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో 14 మంది మరణించిన సంగతి విదితమే.

➡️