ఒడిస్సాలో బస్సు ప్రమాదం .. ఐదుగురు మృతి

Apr 16,2024 12:23 #bus accident, #Odisha

భువనేశ్వర్‌ :    ఒడిస్సాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 35 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు.

వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో జాతీయ రహదారి -16పై బారాబతి బ్రిడ్జ్‌పై ఈ ప్రమాదం జరిగింది. 47 మంది ప్రయాణికులతో పశ్చిమబెంగాల్‌ నుండి పూరీ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బ్రిడ్జిపై నుండి పడిపోయింది. ఓ మహిళ సహా ఐదుగురు మరణించగా, సుమారు 40 మందికి గాయాలైనట్లు ధర్మశాల పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జ్‌ తెలిపారు. క్షతగాత్రులను కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్‌ కాలేజీ తరలించామని అన్నారు. బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.

ఈ ఘటనపై ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం ప్రక టించారు.

➡️