ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : సముద్ర జలాల్లో ఈ నెల 15 నుంచి జూన్ 14 వ తేదీ వరకూ చేపల వేటను నిషేధిస్తున్నట్లు మత్స్యశాఖ ఎఫ్ డి ఓ రామకఅష్ణ మంగళవారం తెలిపారు. యాంత్రిక పడవలు, మేకనైజ్డ్, మోటారు బోట్ల ద్వారా జరిగే అన్ని రకాల చేపల వేటను 61 రోజుల పాటు నిషేధిస్తున్నట్లు తెలిపారు. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించేందుకు ఈ నిషేధం విధించారని తెలిపారు. ఈ మేరకు మత్స్య కారులు సహకరించాలని కోరారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించిన బోట్ల యజమానులకు ఆంధ్రప్రదేశ్ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టాన్ని అనుసరించి శిక్ష పడుతుందని హెచ్చరించారు. బోట్లు, మత్స్య సంపదను స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తారన్నారు. చేపలవేట నిషేధం సక్రమంగా అమలవ్వడానికి మత్స్య శాఖ, కోస్ట్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. వేట నిషేధ సమయం కాలంపాటు మత్స్యకారులు సహకరించాలని కోరారు