ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : గ్రామపంచాయతీ నిర్ణయించిన ధరలకే చేపలను ఆమ్మాలని గోకవరం గ్రామపంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గోకవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో చేపల దుకాణా దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చేపల దుకాణాలు వద్ద కాటా ఏర్పాటు చేసి, గ్రామపంచాయతీ నిర్ణయించి తెలిపిన ధరలకు మాత్రమే చేపలను అమ్మాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. దీనిలో ఏమాత్రం తేడాలు వచ్చినా పంచాయతీ విధించిన చర్యలకు బాధ్యులు అవుతారని యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమం చేపల దుకాణదారులు, పంచాయతీ సిబ్బంది, అబ్రహం పాల్గొన్నారు.