పాక్‌తో తొలి టెస్టు.. ఆసీస్‌ తుది జట్టు ప్రకటన

Dec 13,2023 15:54 #Sports

పెర్త్‌: మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. పెర్త్‌లో జరుగనున్న తొలి టెస్టుకు ఆసీస్ తమ తుది జట్టును ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ బుధవారం ప్రకటించాడు. ట్రవిస్‌ హెడ్‌ ఈ మ్యాచ్‌లో తనకు డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు తెలిపాడు. ఇక పాక్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగనుంది.
ఆస్ట్రేలియా తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్‌ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్‌.

➡️