చీకటి మధ్యలో ఏదో జాతరెళ్ళింది
అర్ధరాత్రంతా మద్దెల దరువులు
పిచ్చి అరుపులు.. మై మెరుపులు
ఈలలు.. ఈదురు గాలులు
గాఢ నిద్రలో ఏమైందో గుర్తే లేదు
పొద్దు పొడిచే వేళకి
ఏ సద్దూ లేదు..
చప్పుడూ లేదు
ఇంట్లోకి చొరబడిన కొత్త నీరు
తరచి చూస్తే బురద వాసన
ఎంత చూసినా నేనెవరికీ పట్టనూ లేదు
తలుపు తట్టనూ లేదు
చప్పున గుర్తొచ్చింది.. చూద్దును కదా
చూపుడు వేలిపై సిరాముద్ర
బుద్ధొచ్చే దాకా నిలిచే పుట్టుమచ్చ
నా మొద్దు నిద్రకు ఆనవాలుగా …
– డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, 94408 36931