ఆగిరిపల్లి: ప్రభుత్వ హామియో వైద్యశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు తమ వంతు సహాకారంగా ఆగిరిపల్లి పెన్సనర్స్ అసోషియేషన్ తరపున ఆర్ధిక సహాయం అందజేయడం ఎంతో స్పూర్తిధాయకమని ఆగిరిపల్లి హామియో వైద్యశాల వైద్యాధికారిణి డి.రజిత అన్నారు. సోమవారం ఆగిరిపల్లి పెన్సనర్స్ అసోషియేషన్ తరపున హామియో వైద్యశాలల్లో నిర్మిస్తున్న యోగాషెడ్డు, టైల్స్, డిస్పెన్సరీకు రూ.10 వేలును వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్సనర్స్ అసోషియేషన్ సభ్యులు జె.చంద్రమౌళీశ్వరరావు, విఎస్ఎన్.రాజు, పార్ధసారధి పాల్గొన్నారు.