గ్రేస్ ఫౌండేషన్ ఆర్ధిక సహాయం

Jan 19,2024 00:29

ప్రజాశక్తి – వేమూరు
కొల్లూరు గ్రామానికి చెందిన పులివర్తి అంకనీడు ప్రసాద్ గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. వ్యవసాయ కూలిగా ఉన్న అంకిరెడ్డి ప్రసాద్ కుటుంబం ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గ్రేస్ ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ నాయకులు కైతేపల్లి షాలెంరాజు తన వంతు సహాయంగా మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు. షాలెం రాజు కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి తన ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేసినట్లు తెలిపారు. కొల్లూరులో జరుగుతున్న అంగన్‌వాడీల నిరవధిక సమ్మెలో పాల్గొని మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఇంచార్జి కొండేటి నగేష్, చుండూరు జాషువా, ఫౌండేషన్ సభ్యులు కామేశ్వరరావు, వాసు, పరిశుద్ధరావు పాల్గొన్నారు.

➡️