ఫైనాన్స్‌ కంపెనీ వేధింపులుాయువకుడు ఆత్మహత్య

Nov 29,2023 08:43 #Suicide

ప్రజాశక్తి- వేటపాలెం (బాపట్ల జిల్లా)కారు కిస్తీ కట్టలేదని ప్రయివేట్‌ ఫైనాన్స్‌ సిబ్బంది వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం… గాదె వంశీకృష్ణ (22) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. అప్పటి నుండి పందిళ్లపల్లిలో అమ్మమ్మ, మేనమామ ఇంటి వద్ద ఉంటున్నారు. ఇటీవల ఒక ఫైనాన్స్‌ కంపెనీలో ఫైనాన్స్‌ తీసుకొని కారు కొనుగోలు చేశారు. వరుసగా నాలుగు నెలల పాటు కిస్తీలు కట్టలేక పోవడంతో ఫైనాన్స్‌ కంపెనీ సిబ్బంది వేధింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల మూడు నెలల కిస్తీలు చెల్ల్లించినా, పెండింగ్‌ నెల కిస్తీ కూడా కట్టాలని సిబ్బంది ఒత్తిడి పెంచారు. దీంతో, వంశీకృష్ణ మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు వేటపాలెం ఎస్‌ఐ జి.సురేష్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

➡️