ఏపీ రైతు సంఘం
ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్ షర్మిల కు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు మండల కార్యదర్శి శివ శంకర్ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల ఖరీఫ్ సీజన్లోనష్టపోయిన రైతులకు 2023 కి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ 251కోట్లు ప్రభుత్వం వెంటనే రైతు ఖాతాల్లోకి జమ చేయాలని ఇన్సూరెన్స్ వెంటనే ప్రకటించాలని మరియు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఉపాధి పని దినాలు 200 రోజులు పెంచాలని 600 రూపాయలు వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు ఎం శివశంకర ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి ఎం రామయ్య ఉపాధ్యక్షురాలు జయమ్మ రైతు సంఘం మండల అధ్యక్షులు రాము పెద్దన్న వెంకట్ రాముడు తదితరులు పాల్గొన్నారు.