రైతు ఆత్మహత్య

Apr 9,2024 22:38 #anathapuram, #rythu, #suside

ప్రజాశక్తి-పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా) : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్రచేడు గ్రామానికి చెందిన చిన్నపుల్లన్న (46) తనకున్న ఎకరం పొలంతోపాటు మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణం కూడా చేపట్టాడు. పంట సాగు, ఇంటి నిర్మాణం కోసం దాదాపు రూ.8.50 లక్షల వరకు అప్పులు చేశారు. పంట సాగులో అనుకుంత దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్తాపంతో సోమవారం రాత్రి అందరూ నిద్రించిన తరువాత ఇంట్లో పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. చిన్న పుల్లన్నకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు.

➡️