నారాయణపురం తండాలో విషాదం 

Feb 5,2024 15:42 #palnadu district, #Suicide
family suicide attempt

ప్రజాశక్తి-మాచర్ల : పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణరపురం తండాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు నేపద్యంలో తన ముగ్గురు పిల్లలకి, భర్తకి టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చిన భార్య వసంత, తాను త్రాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఈశ్వర్ (3) బాలుడు  మృతి చెందాడు. ఉమేశ్వర్, ప్రకాష్ అనే ఇద్దరు పిల్లలు, భార్య వసంతా పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. భర్త రవి నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. నరసరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో భర్తకు చికిత్స అందిస్తుండగా, మెరుగైన వైద్యం కోసం భార్యని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

➡️