ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:సంక్రాంతి సెలవులను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 18వ తేదీతో ముగిసిన సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 9 నుంచి 18వ తేది వరకు పాఠశాల విద్యాశాఖ సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. ఈ నెల 19 నుంచి పాఠశాలలు పున్ణప్రారంభం కావాల్సి ఉంది. అయితే తల్లిదండ్రుల కోరిక మేరకు సెలవులను పొడిగిస్తున్నట్లు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 22న పాఠశాలలు పున్ణప్రారంభమవుతాయని వెల్లడించారు.