ఉత్కంఠ భరితంగా బాక్సింగ్ పోటీలు

Dec 12,2023 16:25 #Boxing, #Sports
  • ఉత్కంఠ భరితంగా సాగిన రెండో రోజు పోటీలు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఉన్న బాక్సింగ్ కోర్టులో జరగుతున్న అండర్ 14,17,19 బాక్సింగ్ రాష్ట్ర పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. రెండు బాక్సింగ్ రింగ్ లో జరుగుతున్న పోటీలు బుధవారంతో ముగియనున్నాయి. లీగ్ దశ పోటీలు మంగళవారంతో ముగియనున్నాయని ,నేడు సెమీ ఫైనల్స్,ఫైనల్స్ మ్యాచ్ లు మూడు విభాగాల్లో జరగనున్నాయి అని తెలిపారు. నేడు విజేతలు తెలనున్నాయి. రెండో రోజు జరుగుతున్న పోటీలను చూసేందుకు అధిక సంఖ్యలో క్రీడా కారులు,నగర ప్రజలు పాల్గొన్నారు.

➡️