ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ : పోలింగ్ కు ముందు జిల్లా కేంద్రం నుంచి నియోజకవర్గానికి కేటాయించిన ఈవిఎంలను భద్రపరుచుటకు మంగళగిరి మండలములోని ఆత్మకూరు గ్రామములో గల నిర్మల కాన్వెంట్ ను డీఎస్పీ, మంగళగిరి రవికాంత్ , ఆర్&బి, ఎలక్ట్రిసిటీ, అగ్నిమాపక అధికారులతో కలిసి రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ రాజకుమారి గణియా (ఐఎఎస్) పరిశీలించారు.స్ట్రాంగ్ రూమ్ స్థిరత్వం, సిసి కెమెరాలు ఏర్పాటు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చి ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనల మేరకు అత్యున్నత ప్రమాణాలతో వారం రోజుల్లోగా తయారు చేయుటకు తగు సూచనలు జారీ చేశారు.తదుపరి పోలింగ్ పూర్తయిన తరువాత EVM లను భద్రపరచుటకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సివిల్ & మెకానికల్ బ్లాక్ లో నున్న గదులను మరియు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.