కర్నూలు జిల్లాలో 2 పోలీసు ఔట్ పోస్టుల ఏర్పాటు

Feb 14,2024 16:33 #Kurnool
Establishment of 2 police outposts in Kurnool district

డిఐజి సిహెచ్ విజయరావు

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టు వద్ద పోలీసు ఔట్ పోస్టు మంత్రాలయం దేవస్ధానం దగ్గర ఒక టూరిస్టు పోలీసు ఔట్ పోస్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని కర్నూలు రేంజ్ డిఐజి సిహెచ్ విజయరావు అన్నారు. జిల్లా ఓర్వకల్లు ఏయిర్ పోర్టు వద్ద ప్రముఖుల భధ్రత, ప్రయాణికుల రధ్దీని దృష్టిలో ఉంచుకొని, కర్నూలు జిల్లా మంత్రాలయం దేవస్ధానంకు వచ్చే భక్తులు, పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓర్వకల్లు పోలీసు ఔట్ పోస్టు మరియు మంత్రాలయం దేవస్ధానం దగ్గర టూరిస్టు పోలీసు ఔట్ పోస్టులలో భద్రత, రక్షణ పరంగా ఇన్ స్పెక్టర్ స్ధాయి అధికారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా తగినంత పోలీసు సిబ్బందితో 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

➡️