మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన

Feb 14,2024 16:13 #England, #Sports, #test match

టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య గురువారం(ఫిబ్రవరి 15) నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్టుకు ఇంగ్లండ్‌ తమ తుదిజట్టును ప్రకటించింది. రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. పేసర్‌ మార్క్‌ వుడ్‌ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌పై వేటువేసింది.
ఇంగ్లండ్‌ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్.

➡️