ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ :ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కొందరు పోలీసులు గాయపడ్డారు. ఘటన స్థలం నుండి భద్రతా దళాలు భారీగా మావోయిస్టుల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️