సభా ప్రాంగణానికి ఎంఎల్‌ఎ ఏలూరి భూమిపూజ

Feb 14,2024 22:18

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్
రా..! కదిలిరా…! సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17న ఇంకొల్లులో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అధ్యక్షతన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు రా.. కదలిరా సభ భూమి పూజ మహోత్సవం బుధవారం కన్నుల పండుగలా నిర్వహించారు. విశాలమైన సభ, కార్యకర్తలు కూర్చునేందుకు ఏర్పాట్లు, పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని కార్యకర్తలంతా భారీగా తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, చీరాల ఇంచార్జ్ మద్దులూరి మాకొండయ్య తనయుడు గౌరీ అమర్నాథ్, కనిగిరి ఇంచార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి, బాపట్ల ఇంచార్జ్ నరేంద్ర వర్మ, సంతనూతలపాడు ఇంచార్జ్ బిఎన్ విజయ్ కుమార్, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

➡️