వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా

Dec 29,2023 23:34

ప్రజాశక్తి – అద్దంకి
రైతుల సాగు చేసిన పంటలు ఎండి పోకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని స్థానిక విద్యుత్ అధికారులకు ఎపిఎస్‌పిడిసిఎల్‌ ఎస్ఈ కెవిజి సత్యనారాయణ సూచించారు. సింగరకొండ రోడ్డులోని సబ్ డివిజనల్ కార్యాలయంలో అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్ డివిజనల్ పరిధిలో 565మంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు డిడిలు ఇచ్చి ఉన్నారని, వారికి తక్షణమే విద్యుత్ సదుపాయం 2024జనవరి 5లోపు అవసరమైన చర్యలు చేపట్టాలని చెపపారు. రైతులకు కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో విద్యుత్ ఈఈ నల్లూరి మస్తానరావు, అద్దంకి, మార్టూరు డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.

➡️