చేతికందేంత ఎత్తులో విద్యుత్‌ వైర్లు – ఆందోళనలో ప్రజలు

ప్రజాశక్తి-మండపేట (కోనసీమ) : చేతికందేంత ఎత్తులో విద్యుత్‌ వైర్లు ఉన్నాయని… అధికారులు చర్యలు చేపట్టాలని మండలంలోని తాపేశ్వరం శివారు పేకెటిపాకల న్యూకాలనీలోని ప్రజలు కోరుతున్నారు. మంగళవారం కాలనీవాసులు ప్రజాశక్తితో మాట్లాడుతూ గోడు వెళ్లబోసుకున్నారు. న్యూకాలనీలో ఉన్న విద్యుత్‌ ట్రాన్ఫార్మర్‌ 11 కివి వైర్లు చేతికి అందేంత ఎత్తులోనే ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొరపాటున విద్యుత్‌ వైర్లు తగిలితే ప్రమాదం సంభవిస్తుందని ట్రాన్ఫార్మర్‌ను ఎత్తులో పెట్టడమే కాకుండా దానిచుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు సంభవించక ముందే ఇప్పటికైనా విద్యుత్‌ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

➡️