ఎన్నికల బాండ్లు అవినీతి కుంభకోణం  

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు వేదికపైన వి కృష్ణయ్య తదితరులు

ప్రమాదకరమైన బిజెపి దాని మిత్రులను ఓడించాలి –  ఇండియా వేదిక అభ్యర్థుల్ని గెలిపించాలి : సిపిఎం

ప్రజాశక్తి – మంగళగిరి  : ఎన్నికల బాండ్లు పెద్ద అవినీతి కుంభకోణం అని, అవినీతికి బిజెపి అవినీతి చేసిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి దాని మిత్రులను ఓడించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపిచ్చారు. గురువారం రాత్రి మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సిపిఎం సమావేశం నాయకులు పి బాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. రామారావు తన ప్రసంగానికి కొనసాగిస్తూ బిజెపి దేశానికి పెద్ద ప్రమాదకరంగా మారిందని, అలాంటి ప్రమాదకర పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో తీసుకురావడానికి టిడిపి, జనసేన పార్టీలు పూనుకున్నాయని విమర్శించారు. లౌకికతత్వం అనే పదాన్ని తొలగించాలని ఉద్దేశంలో బిజేపి ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా బిజెపికి ఎదురుగాలి వీస్తుందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బిజెపి కూటమి గెలవకుండా ఉండేందుకు సిపిఎం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బిజెపికి అన్ని విధాలుగా సహకరిస్తున్న అధికార వైసీపీ పార్టీని ఓడించాలని అన్నారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండియా బ్లాక్‌ వేదిక అభ్యర్థిగా సిపిఎం నాయకులు జొన్న శివశంకరరావు పోటీ చేస్తున్నారని వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి సిపిఎంకే ఉందని అన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారానికి సిపిఎం అనేక పోరాటాలు చేసిందని అన్నారు. ఆ పోరాట కేంద్రాల వద్దకు వెళ్లి సిపిఎం అభ్యర్థికి ఓట్లు అడగాలని అన్నారు. గుంటూరు పార్లమెంటుకు ఇండియా బ్లాక్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజరు కుమార్‌ ను గెలిపించడానికి కృషి చేయాలని అన్నారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి కష్ణయ్య, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ ఎస్‌ చంగయ్య, సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వై కమలాకర్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, సిపిఎం పట్టణ నాయకులు డి రామారావు, ఎం చలపతిరావు, వివి జవహర్లాల్‌, ఎం బాలాజీ, బి స్వామినాథ్‌, ఎస్‌ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

➡️