నోటిఫికేషన్ కు ముందే ఎన్నికల ప్రచారం

Feb 29,2024 12:23 #Konaseema
  • ఇండిపెండెంట్ అభ్యర్థి దూకుడు

ప్రజాశక్తి-రామచంద్రపురం :  ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ లేదు. అయినప్పటికీ ప్రచారాన్ని ప్రారంభించి అందరికంటే ముందు దూకుడు ప్రదర్శిస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థి రామరాజు. ఆయన పట్టణంలో పల్లెల్లోనూ ఆటోలను ఏర్పాటు చేసుకుని ఎన్నికల ప్రచారం ముందుగానే ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.2019 లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రామరాజు రామచంద్రపురం పట్టణం,18 వ వార్దు, కవలవారిసావారం, లో నివాసం ఉంటారు. గత ఎన్నికల వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ, లో కొనసాగారు. తరవాత పలు ప్రజా సమస్యల పైన ఆక్రమ ఇసుక తవ్వకాలపై పైన, పట్టణంలో పలు ఆక్రమణలు పైన, సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ, రామచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వంచాలంటూ కొనసాగిన ఆందోళన లోనూ ఆయన చురుకుగా పాల్గొన్నారు. పలు ప్రజా సమస్యలపై ఆయన స్వయంగా హైకోర్టులో పోరాటాలు కొనసాగించారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు మళ్లీ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే అటు ఆయన చేయబోయే కార్యక్రమాలను ప్రసారం చేసుకుంటూ నోటిఫికేషన్ వెలువకుండానే గత వారం రోజులుగా తనకు ఓటు వేసి గెలిపించాలని సమస్యలపై నిరంతరం పోరాడుతానని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి అందరికంటే ముందుగా దూకుడు ప్రదర్శించటం ఇటు ఓటర్లను అటు నాయకులను ఆలోచింపజేస్తుంది.

➡️