ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా కృషి

May 8,2024 22:25
నియోజకవర్గ పరిధిలో

ప్రజాశక్తి – పెద్దాపురం

నియోజకవర్గ పరిధిలో నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేం దుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు కృషి చేయాలని రిటర్నింగ్‌ అధికారి జె.సీతారామారావు కోరారు. బుధ వారం ఆయన డివిజనల్‌ రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన ఇవిఎంల పనితీరుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవిఎంల ట్యాంపరింగ్‌ జరిగే అవకాశం ఉందని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దన్నారు. ఇవిఎంల ట్యాంపరింగ్‌ అనేది అపోహ మాత్రమేనని అన్నారు. ఈనెల 13న జరిగే పోలింగ్‌కు సంబంధించి అన్ని పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్‌కు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ కార్యాలయం ఎఒ సుబ్రహ్మణ్యం, రాజకీయ పార్టీల ప్రతినిధులు చింతా శ్రీనివాసరావు, నూనె రామారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️