ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. పీఎంఎల్ఏ చట్టం 2002 కింద రూ.97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల్లో జుహులో శిల్పాశెట్టి పేరు మీద ఉన్న రెసిడెన్షియల్ ఫ్లాట్, పుణేలోని ఓ బంగ్లా, రాజ్ కుంద్రా పేరు మీద ఈక్విటీ షేర్లు ఉన్నాయి.