డప్పు కొట్టి పోటీలు
హిందూపురం : కుల వివక్ష పోరాట సమితి (కెవిపిఎస్) జిల్లా కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో గురువారం పట్టణ సమీపంలోని సిపిఎం కొట్టాలలో డప్పుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రమణ డప్పు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా రమణ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించామన్నారు. పోటీల్లో గెలుపొందిన వారందరికీ ఈ నెల 14న అంబేద్కర్ జయంతి రోజున బహుమతులు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు నారాయణ, గోపాలకష్ణ, వెంకటేష్, నారాయుడు, జ్యోతమ్మ, ఇళ్ల స్థలాల పోరాట కమిటీ నాయకులు నీలమ్మ, లక్ష్మీదేవి, అమ్మ సరస్వతమ్మ, భాగ్యమ్మ, మాధవి, కీర్తి తదితరులు పాల్గొన్నారు.