ప్రజాశక్తి-ఆదోని : ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చి ఆర్టీసీ పట్ల నమ్మకం పెంచాలని ఆర్టిసి డిపో మేనేజర్ రఫీక్ హమద్ సూచించారు.
ఆదోని ఆర్టీసీ గ్యారేజ్లో అసిస్టెంట్ ఇంజీనర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో బుధవారం డ్రైవర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిపో మేనేజర్ ఎండి రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్దిలో, ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో డ్రైవర్స్ పాత్ర కీలకమన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. డ్రైవర్లకు గులాబీ పుష్పమిచ్చి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఐ2, టిఐ3, కంట్రోల్లర్, ఎస్డిఐ సిబ్బంది పాల్గొన్నారు.