అనుమతులు లేకుండా ప్రచారాలు చేయోద్దు

Mar 30,2024 23:29 ##parchuru #ero #election

ప్రజాశక్తి – పర్చూరు
అనుమతులు లేకుండా రాజకీయ పార్టీలు ప్రచారాలు, సభలు జరపవద్దని ఎన్నికల అధికారి, బాపట్ల ఆర్‌డిఒ జి రవీందర్ సూచించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటన ఇచ్చినప్పటి నుండే నియమావళి అమలులో ఉందని తెలిపారు. పార్టీ ఆఫీసులు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, కరపత్రాల పంపిణీ ఇలా ప్రతి విషయాలకు అభ్యర్థులు, పార్టీలు అనుమతులు తీసుకోవాలని సూచించారు. సువిధ యాప్‌ ద్వారా, తమ కార్యాలయంలో గానీ దరకాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా 24గంటల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. అందరూ ఎన్నికల నియమావళి పాటించాలని కోరారు. సమావేశంలో పర్చూరు, ఇంకొల్లు తహశీల్దారులు సిహెచ్‌ సుబ్బయ్య, ఎంప్రమీల పాల్గొన్నారు.

➡️