ప్రజాశక్తి-కోట : మండల పరిధిలోని కర్లపూడి గ్రామ పంచాయతీలో పోతుగుంట వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అంత్యక్రియలకు గాను టిడిపి రాష్ట్ర బీసీ సెల్ నాయకులు తీగల.సురేష్ బాబు 3000 రూపాయలను అందజేశారు.ఈ సందర్బంగా కర్లపూడి గ్రామానికి చెందిన పోతుగుంట వెంకటేశ్వర్లు(65) ప్రమాదవశాత్తు గుంటలో పడి మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా సమాచారం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ నాయకులు తీగల సురేష్ బాబు ఆ కుటుంబం వద్దకు వారిని పరామర్శించడం జరిగింది. ఆయనతో పాటు టిడిపి నాయకులు జరుగుమల్లి కోటేశ్వరరావు, కర్లపూడి రాంబాబు, జరుగుమల్లి చెంచు కృష్ణయ్య, కర్లపూడి వెంకట కృష్ణయ్య, వెంకటేశ్వర్లు,కుటుంబ సభ్యులు పోతుగుంట మాధవ్ ఉన్నారు.