మేడే రోజున జెండా ఆవిష్కరణలకు జిల్లా కలెక్టర్‌ అనుమతి

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో… మే 1 న కార్మిక దినోత్సవం సందర్భంగా వేడుకల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ను సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలు నిర్వహించకూడదని జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సూచించినట్లు ఆంజనేయ నాయక్‌ తెలిపారు. మే డే జెండా ఆవిష్కరణను జిల్లా వ్యాప్తంగా వాడవాడలా నిర్వహించాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, తదితరులు జిల్లా కలెక్టర్‌ ను కలిశారు.

➡️