ఉదయగిరిలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

Mar 26,2024 16:21 #AP police, #Nellore District

ప్రజాశక్తి-ఉదయగిరి(నెల్లూరు) : జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టులను పరిశీలించినట్లు జిల్లా ఎస్‌పి డాక్టర్‌ కే.తిరుమలేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఉదయగిరి సీఐ సర్కిల్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం ఆయన సిఐ సర్కిల్‌ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18 చెక్‌ పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. వాటి ఏర్పాటు పర్యవేక్షణకు 26 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీములు ఏర్పాటు చేసి ఇప్పటికే తనిఖీలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని చెక్‌ పోస్టులను తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల గిరిబాబు ఎస్‌ఐలు కర్నాటి ఇంద్రసేనారెడ్డి వరికుంటపాడు ఎస్‌ ఐ తిరుపతయ్య దుత్తలూరు ఎస్‌ ఐ ఉమామహేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.

➡️