- కోరమండల్ ఇంటర్నేషనల్ వెల్లడి
హైదరాబాద్ : వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి, మహిళా స్వయం సహాయక బృందాలకు 200 డ్రోన్లను అందించినట్లు కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోని మాణిక్యమ్మగూడ, గుంటూరుతో సహా దేశంలోని 11 ప్రాంతాలలో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ అందించిన 200 డ్రోన్లతో సహా 1,000 డ్రోన్లను వివిధ ఎస్హెచ్జిల సభ్యులకు ప్రధాని మోడి వర్చ్యువల్గా అందజేశారని ఆ సంస్థ పేర్కొంది. కోరమాండల్ సరఫరా చేసిన డ్రోన్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళా ఎస్హెచ్జి సభ్యులు ఉపయోగిస్తారని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అరుణ్ అళగప్పన్ తెలిపారు.