ప్రజాశక్తి-మధురవాడ (విశాఖ) :విశాఖలోని పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అదృశ్యమైనట్లు సిఐ వై.రామకృష్ణ తెలిపారు. సిఐ కథనం ప్రకారం… నెల్లూరు జిల్లాకు చెందిన ఆర్.మధుబాబు కొమ్మాది వికలాంగుల కాలనీలో ఉంటూ 14వ బెటాలియన్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 21న విధులు ముగించుకొని వెళ్లిన మధుబాబు తిరిగి 22న విధులకు హాజరు కాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. మధుబాబు సోదరుడు హరిబాబు పరిసర ప్రాంతాల్లో వెతికాడు. ఎక్కడా ఆచూకీ కానరాలేదు. ఆన్లైన్ బెట్టింగ్ల కోసం లోన్ యాప్ల నుంచి భారీ మొత్తంలో రుణాలు పొందినట్లు లేఖ ద్వారా తెలిసింది. ఈ మేరకు హరిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.