బస్టాండ్ వద్ద బస్సులు ఆపాలి

Nov 27,2023 16:50 #East Godavari
demand for bus stand

ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మెయిన్ బజార్ లో ఉన్న బస్టాండ్ వద్ద బస్సులు ఆపాలని బస్సులు వచ్చేసమయంబోర్డుఏర్పాటచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు బస్టాండ్ వద్ద ఆటోలుఆడ్డు లేకుండా చూడాలి. ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని ప్రయాణికులు స్థానికులు కోరుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 1977 సంవత్సరంలో అప్పటి కొవ్వూరు నియోజక వర్గ శాసనసభ్యులు ఆళ్ళ హనుమంతరావు తల్లి మాణిక్యాంబ తన భర్త రామన్న జ్ఞాపకార్థం నిర్మించారని స్థానికులు తెలిపారు. నిడదవోలు డిపో నుండి రాజమండ్రి కాకినాడ ఏలూరు ద్వారక తిరుమల జంగారెడ్డిగూడెం పోలవరం నరసాపురం నిడదవోలు భీమవరంబస్టాండ్ కు వెళ్లేటకు ప్రయాణికులకు అనుకూలంగా ఉండేవని గత కొన్ని సంవత్సరాల నుండి కొన్ని బస్సు రూట్ లు తప్పించడం పోలవరం నిడదవోలు తప్ప ఏలూరు గాని రాజమండ్రి గాని జంగారెడ్డిగూడెం రూట్లు బస్సులు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం కొవ్వూరు నియోజవర్గం లోనున్న చాగల్లు మండలం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కలవడం వల్ల రాజమండ్రి వెళ్ళుటకు బస్సు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి గాని శనివారం ఉదయం ద్వారక తిరుమల బస్సు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కావున సంబంధిత అధికారులు బస్టాండ్ వద్ద ఉన్న ఫ్లెక్సీలు తొలగించి ఆటోలు అడ్డు లేకుండా చూడాలని ఆయన, ప్రయాణికులు కోరుతున్నారు.

➡️