షర్మిల నియామకం పట్ల హర్షం

Jan 17,2024 23:42

ప్రజాశక్తి – చెరుకుపల్లి
పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియామకం పట్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేసన రామ కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిసిసి చీఫ్‌గా వైఎస్ షర్మిల, సిడబ్ల్యూసి మెంబర్‌గా గిడుగు రుద్రరాజు నియామకం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ సానుభూతిపరులు అందరిని కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. వైఎస్ షర్మిల, మాజీ ఎంపీ జేడీ శీలం నేతృత్వంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుబోయిన సాంబశివరెడ్డి, మండల అధ్యక్షుడు మండే సురేష్, పెరికల మురళి, పడమటి యుగంధర్, పరిసా తిరుమలరావు, న్యాయవాది కేసన జగదీష్ పాల్గొన్నారు.

➡️