Delhi: ఢిల్లీలో అగ్నిప్రమాదం : నలుగురు మృతి

Mar 14,2024 13:13 #4 dead, #Delhi, #Fire Accident

న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహ్దారాలోగల శాస్త్రినగర్‌ ప్రాంతంలోని ఒక భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతోపాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను మనోజ్‌ (30), అతని భార్య సుమన్‌ (28), ఐదేళ్ల చిన్నారి, మూడున్నరేళ్ల ఇద్దరు చిన్నారులుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై డిసిపి షహదారా సురేంద్ర చౌదరి మాట్లాడుతూ.. ‘గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో గీతా కాలనీ పోలీస్‌ స్టేషన్‌ నుంచి మాకు ఫోన్‌కాల్‌ వచ్చింది. హుటాహుటిన అప్రమత్తమై అంబులెన్స్‌, అగ్నిమాపక దళం, పిసిఆర్‌ వ్యాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ ప్రమదంలో గాయపడిన తొమ్మిది మందిని రక్షించి ఆసుపత్రికి రతలించాము.’ అని ఆయన అన్నారు. తొలుత పార్కింగ్‌ ఏరియాలో మంటలు చెలరేగి.. ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అర్పే ప్రయత్నం చేశారని సురేంద చౌదరి అన్నారు.

➡️